న్యూఢిల్లీ, రైతుముచ్చట: దేశ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నేతృత్వంలోని కాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ (CCEA) 2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి గాను ఆరు రకాల రబీ పంటల కనీస మద్దతు ధరల (MSP) పెంపునకు ఆమోదం తెలిపింది. సంప్రదాయ పంటల సాగే కాకుండా, వైవిధ్యమైన పంటల సాగు ప్రోత్సాహకంలో భాగంగా ముఖ్యంగా నూనెగింజలు, పప్పుదినుసు పంటల సాగు పెంచాలనే లక్ష్యంగా ఈ సారి రబీ పంటల కనీస మద్దతు ధరలు పెంచడం జరిగింది.
| పంట | MSP 2021-22 |
MSP 2022-23 |
పెంపు |
| గోధుమ | 1975 | 2015 | 40 |
| బార్లీ | 1600 | 1635 | 35 |
| కంది | 5100 | 5230 | 130 |
| మసూర్ | 5100 | 5500 | 400 |
| ఆవాలు | 4650 | 5050 | 400 |
| కుసుమ | 5327 | 5441 | 114 |