తెలంగాణ, రైతుముచ్చట: వ్యవసాయంలో ప్రస్తుతం రైతులు వాడుతున్న యూరియా వల్ల భూమి, నీరు, గాలికి అవుతున్న కలుషితాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని సంరక్షించడంలో భాగంగా భారతీయ రైతుల ఎరువుల సహకార సంస్థ (IFFCO) నానో టెక్నాలజీ ద్వారా యూరియాను కనుగొని వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా ప్రపంచంలో మొదటి సారిగా ఈ నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్ ను కూడా పొందింది. కార్పోరేట్ సంస్థల నుండి కాకుండా ప్రభుత్వ పరిధిలోని సహకార సంస్థ నుండి ఇలాంటి సరికొత్త టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి రావటం గర్వించదగ్గ విషయం.
ఈ సంధర్భంగా, హైదరాబాద్ లోని మినిష్టర్స్ క్వార్టర్స్ లో గుజరాత్ రాష్ట్రంలోని కలోల్ నుండి తెలంగాణకు బయలుదేరిన మొదటి నానో యూరియా ట్రక్ ను ఆన్ లైన్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సమావేశానికి ఇఫ్కో వైస్ చైర్మన్ దిలీప్ సంఘానీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.
ఇక నుంచి రైతులకు అందుబాటులోకి నానో యూరియా